kishan Reddy : మంత్రి కేటీఆర్ ట్వీట్కు కిషన్ రెడ్డి కౌంటర్
kishan Reddy : మంత్రి కేటీఆర్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. TRS ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.;
kishan Reddy : మంత్రి కేటీఆర్ ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. TRS ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. TRS పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని ఆరోపించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఉద్యమకారులకు సరైన గౌరవం లేదన్నారు.
రుణమాఫి, దళితబంధు, పంట నష్ట పరిహారం, దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం హామీల అమలేదంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసపూరిత హామీలకు లెక్కే లేదంటూ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. అంతరకుముందు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
"అప్పులకు కొదవ లేదు"
— G Kishan Reddy (@kishanreddybjp) May 2, 2022
"కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు"
"కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు"
"సామాజిక న్యాయం లేదు"
"సచివాలయం లేదు"
"సీఎం ప్రజలను కలిసేది లేదు"
"ఉద్యమ కారులకు గౌరవం లేదు"
"విమోచన దినోత్సవం జరిపేది లేదు"
.
.
.
.
.
ఇలా చెప్పుకుంటూ పోతే "కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు"
టీఆర్ఎస్ పాలనలో
— G Kishan Reddy (@kishanreddybjp) May 2, 2022
"ఇంటికో ఉద్యోగం లేదు"
"నిరుద్యోగ భృతి లేదు"
"ఉచిత ఎరువులు లేదు"
"ఋణమాఫీ లేదు"
"దళిత ముఖ్యమంత్రి లేదు"
"దళితులకు మూడెకరాల భూమి లేదు"
"పంటనష్ట పరిహారం లేదు"
"దళితబందు లేదు"
"బిసిబందు అసలే లేదు"
"ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు"
"డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు"
బీజేపీ పాలనలో ఆక్సిజన్ నుంచి అన్ని కొరతేనని, బొగ్గు కొరత వల్ల అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరతేనని, ఈ సమస్యలన్నింటికి ప్రధాని మోదీకి విజన్ కొరతే కారణం అంటూ విమర్శించారు.
బీజేపీ పాలనలో *బొగ్గు కొరత*
— KTR (@KTRTRS) May 2, 2022
కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత*
పరిశ్రమలకు *కరెంట్ కొరత*
యువతకు *ఉద్యోగాల కొరత*
గ్రామాల్లో *ఉపాధి కొరత*
రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత*
అన్ని సమస్యలకు మూలం PM
*మోడీకి విజన్ కొరత*
NPA Govt's amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF