Huzurabad By Election : హుజురాబాద్‌ లో ఓటర్లు ఎంతమంది.. ఎవరివైపు మొగ్గు?

Huzurabad By Election : గత కొన్ని నెలలుగా హోరాహోరీగా జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈనెల 30న పోలింగ్‌ జరగనుంది.

Update: 2021-10-27 16:15 GMT

Huzurabad By Election : గత కొన్ని నెలలుగా హోరాహోరీగా జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈనెల 30న పోలింగ్‌ జరగనుంది. 2 లక్షల 36 వేల 873 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో లక్షా 19 వేల 093 మంది మహిళలు ఓటర్లు, లక్షా 17వేల 779 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే ఒక ట్రాన్స్‌జెండర్‌ ఓటరు ఉన్నారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నికకోసం 306 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 172 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, 63 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. రెండువేల మంది పోలీసులతో పాటు 20 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను భద్రత కోసం నియోగిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి 500 మీటర్ల వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు.


పోలింగ్‌ సమయంలో ప్రతి ఒక్క ఓటర్‌ కరోనా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్‌లు, సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని లేకుంటే ఆర్టీపీసీఆర్‌ రిపోర్ట్‌ తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News