TS : డబుల్ బెడ్రూం ఇళ్లు మేం కట్టిస్తాం.. నడ్డా హాట్ కామెంట్

Update: 2024-05-07 07:34 GMT

తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు మూడు పార్టీల అగ్రనేతలు రజాకార్లేనని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాట్ కామెంట్ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా విమర్శించారు.

కేసీఆర్ హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు మేం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకోవడం లేదని నడ్డా విమర్శించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ నెంబర్ వన్ అవుతుందన్నారు.

పెద్దపల్లిలో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అయిదో స్థానంలో ఉందన్న నడ్డా దేశంలో 56 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, 52వేల కిలోమీటర్ల మేర రైల్వే విద్యుద్దీ కరణ చేపట్టినట్లు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు రజాకార్ పాలకులేనని నడ్డా ఆరోపించారు. విభజించి పాలించే నేతలకు బుద్ధి చెప్పాలన్నారు.

Tags:    

Similar News