భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను తెలంగాణ మంత్రులు సందర్శించారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తర్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి ప్రాజెక్టును పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో వారు సమావేశం అయ్యారు.
మంత్రులకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు చాలా అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy ) అన్నారు. ఆరు నెలల్లో ఆరు ప్రాజెక్టును ఆయన సందర్శించానని చెప్పారు. రూ.9వేల కోట్లు ఖర్చు చేసి కూడా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రీ డిజైన్ పేరుతో వారు డబ్బులు దండుకున్నారు తప్ప.. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పనులు చేయలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు కెనాల్కు రాజీవ్ కెనాల్గా పేరు పెడతామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మండిపడ్డారు.
కేవలం రూ.2654 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు రూ.20వేల కోట్లు పెంచి ప్రజాధానాన్ని లూటీ చేశారని ఫైర్ అయ్యారు భట్టి. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం వచ్చిన వెంటనే రివ్యూ చేసి ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.