Madhya Pradesh : 50 వేల మంది ఉద్యోగులకు ఆర్నెళ్లుగా జీతాల్లేవ్!

Update: 2025-06-06 13:15 GMT

మధ్య ప్రదేశ్ ను కుదిపేసిన కుంభకోణం భోపాల్: మధ్యప్రదేశ్లో అతిపెద్ద 'జీతాల కుంభకోణం'వెలుగుచూసింది. 50,000మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాల చెల్లింపులు లేవు. ఈ ఉద్యోగులు అధికారిక పత్రాల్లో ఉన్నారు. వారికి గుర్తింపు, పేరు, ఉద్యోగి కోడ్ ఉంది. కానీ ఆరునెలలుగా వారికి జీతాల చెల్లింపు ప్రాసెస్ జరగలేదు. ఒకవేళ ఈ ఉద్యోగులు జీతం లేని సెలవుల్లో ఉన్నారా లేదా వారిని సస్పెండ్ చేశారా? లేదా వారు 'గోస్ట్' ఉద్యోగులా ? అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ టాస్క్ఫోర్స్లో వీరి సంఖ్య దాదాపు 9% ఉండటం గమనార్హం. డిడిఒలు మే 23న కమిషనర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ కు పంపిన లేఖల ఆధారంగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఐఎఫ్ఎంఐఎస్ కింద 2024 డిసెంబర్ నుంచి జీతాలు తీసుకోని రెగ్యులర్, నాన్ రెగ్యులర్ ఉద్యోగుల డేటాను జత చేసింది. ఉద్యోగి కోడ్లు ఉన్నప్పటికీ ఐఎ ఫ్ఎంఐఎస్ వారి ధ్రువీకరణ అసంపూర్తిగా ఉంది. ఎగ్జిట్ ప్రాసెస్ కూడా పూర్తి కాలేదు. ఈ లేఖ తర్వాత, 6,000 మందికి పైగా డీడీవోలు దర్యాప్తు చేస్తున్నారు. రూ.230 కోట్ల స్కాం జరిగి నట్టు తెలుస్తోది. ప్రతి డీడీవో నుంచి అనధికారిక ఉద్యోగులు వారి కార్యాలయాల్లో పనిచేయడం లేదన్న సర్టిఫికెట్ కోరుతూ ట్రెజరీ, అకౌంట్స్ విభాగం ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉండగా.. 40,000మంది రెగ్యులర్, పదివేల మందిన తాత్కాలిక ఉద్యోగుల జీతాలు ఇంకా తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఉద్యోగులకు కోడ్లు ఉన్నందున వారి జీతాలు ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా వీరి ఆరు నెలల శాలరీ మొత్తం రూ.230 కోట్లు. ఆరు నెలల నుంచి జీతాలు లేకుండా ఎలా పనిచేస్తున్నారనే ప్రశ్న లు ఉత్పన్నమవుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు జీతాలు అందకపోవడం వల్ల నకిలీ ఉద్యోగి కోట్లు కేటాయించి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. ఈ అంశంపై మధ్యప్రదేశ్ ఆర్థికమంత్రి జగదీష్ దేవా అస్పష్టంగా సమా ధానమిచ్చారు. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని పేర్కొన్నారు.

Tags:    

Similar News