దేశ రాజధాని ఢిల్లీలో లవ్ జిహాద్ ఘటన సంచలనం కలిగిస్తోంది. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో సద్దామ్ తన పేరును రాజ్గా పరిచయం చేసుకుని ఓ హిందూ బాలికతో స్నేహం పెంచుకున్నాడు. ఢిల్లీ ఐటీఓ వద్ద స్కూల్ బయట ఆ బాలికను కలిసేందుకు సద్దామ్ ప్రయత్నించాడు. ఐతే.. అతని ఒరిజినల్ పేరును ఆ హిందూ బాలిక రాబట్టింది. సద్దామ్ అని తెలుసుకుని అతని వెంట వెళ్లేందుకు నిరాకరించింది. ఐతే.. సద్దామ్ బలవంతం చేయడంతో బాలిక పోలీసులను పిలిచింది. దీంతో.. ఆమెను రెస్క్యూ చేస్తూ పోలీసులు సద్దాంను అరెస్ట్ చేశారు. చీటింగ్ కేసు నమోదు చేశారు.