Maharashtra : ఆత్యహత్య కోసం రైలు పట్టాలపై.. యువకుడిని సెకండ్లలో కాపాడిన పొలీస్..!
Maharashtra : రైలుపట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ఓ యువకుడు సిద్దమవ్వగా ఇది గమనించిన ఓ రైల్వే పోలీస్ ధైర్యం చేసి అతడ్ని కాపాడాడు.;
Maharashtra : రైలుపట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ఓ యువకుడు సిద్దమవ్వగా ఇది గమనించిన ఓ రైల్వే పోలీస్ ధైర్యం చేసి అతడ్ని కాపాడాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. విఠల్వాడి రైల్వే స్టేషన్ లో ఓ 18 ఏళ్ల యువకుడు రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫామ్ అంచున నిల్చొని ఉన్నాడు.
రైల్ వస్తోందని వెనక్కి జరగాలని ఆ యువకుడిని కోరాడు కానిస్టేబుల్ మానే .. ఆ తర్వాత ఆ యువకుడు వెనక్కి వెళ్లాడా లేదా అని కొద్దిసేపు అయ్యాక తిరిగి చూస్తే.. అతను ఫ్లాట్ఫామ్ నుంచి రైలు పట్టాలపై దూకాడు. దీనితో అతనిని రక్షించేందుకు ముందుగా తటపటాయించిన మానే.. ఆ తర్వాత కాస్త వెనక్కి వెళ్లి వేగంగా రైలు పట్టాలపైకి జంప్ చేసి ఆ యువకుడిని పట్టాల నుంచి అవతలకు తోసేశాడు.
మూడు సెకండ్లలో ఆ ఎక్స్ప్రెస్ రైలు ఆ స్పాట్ నుంచి వేగంగా వెళ్లి స్టేషన్ను క్రాస్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువకుడ్ని కాపాడిన రైల్వే పోలీసు సమయస్ఫూర్తి, ధైర్య సాహసాన్ని అధికారులతోపాటు నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇక యువకుడిని అతని తల్లిదండ్రులకి అప్పగించారు.
A 35-year-old government railway police (GRP) constable jumped on the railway tracks moments before an express train was to pass to save an 18-year-old who allegedly tried to die by suicide at Vithalwadi railway station @SachinKalbag @htTweets @HTMumbai pic.twitter.com/UA4NCf8lXF
— Megha Pol (@Meghapol) March 23, 2022