ఒకప్పడు బాలీవుడ్ ను రూల్ చేసిన అగ్రతార రవీనా టాండన్ ఒకరు.1991లో 'పత్తర్ కే ఫూల్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'బంగారు బుల్లోడు' మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన నటించి మెప్పించింది. ఇటీవల 'కేజీఎఫ్ 2'లో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ బాలీవుడ్ నటి పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ హృదయాలను బరువెక్కేలా చేసింది. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత తొలిసారి ఎయిరిండియా ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 'న్యూ బిగినింగ్స్... అన్ని అడ్డంకులను తట్టుకుని నిలవాలి. ప్రస్తుతం ఎయిరిండియా సిబ్బంది బాధలో ఉన్నప్పటికీ కొత్త సంకల్పం కోసం చిరునవ్వులతో ప్రయాణికులను స్వాగతిస్తున్నారు. ప్యాసింజర్స్, సిబ్బంది మధ్య ఏదో తెలియని బంధం ఏర్పరు చుకున్నారు. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం. ఎప్పటికీ మర్చి పోలేని గాయమది. కానీ ఎయిరిండియా ఎల్లప్పుడూ ఇలాంటి వాటిని అధిగమించి మళ్లీ బలంగా నిలబడాలనేదే వారి సంకల్పం. ప్రమాదాలు ప్రయాణాలను ఆపలేవు!' అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది.