Madhya Pradesh : డెలివరీ బాయ్‌ పై మహిళ దాడి.. చెప్పుతో కొట్టి

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న తన స్కూటీని ఢీ కొట్టాడని ఓ డెలివరీ బాయ్‌‌‌ని చెప్పుతో కొట్టింది.

Update: 2022-04-16 14:47 GMT

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న తన స్కూటీని ఢీ కొట్టాడని ఓ డెలివరీ బాయ్‌‌‌ని చెప్పుతో కొట్టింది. బూతులు తిడుతూ వాహనాన్ని తన్నింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జరుగుతున్నంత సేపు రోడ్డు పై వెళ్తున్న వారందరూ చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీనితో స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విషయం ఆరా తీసి సదరు మహిళ పైన కేసు నమోదు చేశారు. డెలివరీ బాయ్‌ను జబల్‌పూర్ నగరంలోని దిలీప్ విశ్వకర్మ (25)గా, మహిళగా  మధు సింగ్ ని  పోలీసులు గుర్తించారు. మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Tags:    

Similar News