Attari-Wagah Border : అట్టారీ - వాఘా వద్ద హడావుడి.. దేశం దాటుతున్న స్థానికులు
పహల్గాం ఉగ్రదాడితో భారత్ - పాక్ సరిహద్దు అట్టారీ-వాఘాలో సామాన్యుల పరిస్థితులు గందరగోళంలో పడ్డాయి. పలు పనులపై దేశం దాటి వచ్చిన వాళ్లు ప్రభుత్వాల ఆదేశాలతో బోర్డర్ దాటుతున్నారు. పదిహేను రోజుల్లో ఇండియాలో చుట్టాల ఇంట్లో పెళ్లి ఉందని వచ్చామని.. ఇప్పుడు ఉన్నఫళంగా వెళ్లిపోతున్నామని ఓ మహిళ ఆవేదనగా చెప్పింది. తమ బంధువులను కరాచీకి పంపేందుకు బోర్డర్ కు వచ్చిన భారతీయులు.. పాకిస్తాన్ కు ఎట్టిపరిస్థితుల్లో బుద్ధి చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.