భారీ వరదలు.. 251 మంది మృతి
గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి.. 251 మంది మృతి చెందారు.
బంగ్లాదేశ్ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశమంతటా వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 251 మంది మృత్యువాత పడినట్లు సర్కార్ తెలిపింది. గత జూన్ నుంచి మూడు సార్లు దేశాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో ఈ వరదల వల్ల దేశంలోని 33 జిల్లాల్లో మరణాలు సంభవించాయని బంగ్లాదేశ్ హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది.ఈ వరదలు మొత్తం 50 లక్షల మందిని ప్రభావితం చేశాయన్నారు.