అమెరికా ప్రభుత్వం వీసా రూల్స్ మార్చేసింది. దరఖాస్తు దారులు సోషల్ మీడియా సమాచారం విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది అమెరికా ఎంబస్సీ. డీఎస్ 160 వీసా అప్లికేషన్లో అభ్య ర్థులు ఐదేళ్ల నుంచి వినియోగిస్తున్న సోషల్ మీడియా 'యూజర్ నేమ్'లు, హ్యాండిల్స్ ను కచ్చితంగా వెల్లడించాల్సిందేనని ఆ పోస్టులో సూచించింది. ఆ దరఖాస్తులో ఉన్న సమాచారం పూర్తిగా వాస్తవం.. సరైనదే అని సంతకానికి ముందే అభ్యర్థి ధ్రువీకరించాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. ఫేస్బుక్, యూట్యూబ్, లింక్ఇన్, ఎక్స్ సహా ఇతర వేదికలపై ఉన్న ఐడీలను అప్లికేషన్లో వెల్లడించి తీరాల్సిందన ని తెలిపింది. అమెరికాకు చెందిన ఎఫ్, ఎం, జె కేటగిరీ వీసాలకు దరఖాస్తు చేసుకొనేవారికి నిబంధన లు మారాయి. స్టూడెంట్స్, ఎక్స్ఛేంజీ విజిటర్స్ నాన్ ఇమిగ్రెంట్స్ వీసాలకు అప్లై చేసుకొనేవారు కచ్చితంగా తమ సామాజిక మాధ్యమ ఖాతాలను పబ్లిక్ చేయాల్సిందే. ఈ నిబంధన తక్షణమే అమ ల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. దీంతో దరఖాస్తు దారులు తమ ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చుకోవా లని పేర్కొంది. అమెరికా చట్టాల ప్రకారం సోషల్ మీడియా వెట్టింగ్ తప్పనిసరి అని వెల్లడించింది. ఎఫ్, ఎం, జె వీసాలు సాధారణంగా నాన్ ఇమి గ్రెంట్ శ్రేణిలోకి వస్తాయి. విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి, ఎక్స్ చేంజీ విజిటర్స్ ప్రోగ్రాముల్లో పాల్గొనడానికి జారీ చేస్తారు. వీటిల్లో కూడా ఎఫ్ వీసా అకాడమీల్లో చదవాలనుకొన్న వారికి, ఎం వీసా ఒకేషనల్ స్టూడెంటస్క, జె వీసా ఎక్స్ చేంజీ విజిటర్స్, రీ సెర్చర్లు, స్కాలర్లు, ఇంటర్లకు జారీ చేస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తు న్న కఠినమైన విధానాలతో గందరగోళంలో ఉన్న విదేశీ విద్యార్థులకు తాజాగా 'సోషల్ మీడియా వెట్టింగ్ ' దిగులు పట్టుకొంది.