Pakistan : మీరే కాస్త మాట్లాడండి.. ట్రంప్ కు పాక్ ప్రధాని ఫోన్

Update: 2025-06-06 12:30 GMT

దౌత్యపరమైన చర్యల కోసం పాకిస్తాన్ మరోసారి అమెరికా వైపు మొగ్గు చూపింది. ఇరు దేశాల మధ్య శాంతి ప్రక్రియ కొనసాగేలా భారత్ తో చర్చలు జరుపాలని ఆ దేశ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంపు విజ్ఞప్తి చేశారు. ఇస్లామాబాద్ లోని యూఎస్ ఎంబసీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ట్రంప్ తీసుకున్న చర్యలను ప్రశంసించారు. అదే విధంగా ఆణ్వాయుధ దేశాల మధ్య చర్చల్లో కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. ట్రంప్ చొరవతోనే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ఇప్పటికే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్తో చర్చలుండవని, అదే విధంగా పీవోకే విషయంలో మూడోదేశం మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించమని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.

Tags:    

Similar News