Pithapuram : పిఠాపురంలో రూ.17 కోట్ల బంగారం, వెండి పట్టివేత

Pithapuram : పిఠాపురంలో రూ.17 కోట్ల బంగారం, వెండి పట్టివేత

పిఠాపురంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద రూ.17 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువుల్ని అధికారులు తాజాగా పట్టుకున్నారు. వాటికి సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసి కాకినాడలోని జిల్లా ఖజానాకు తరలించారు. పట్టుబడిన వాహనం వైజాగ్‌ నుంచి కాకినాడ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 13న కూడా ఇదే తరహాలో రూ. 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరి ఆ బంగారం ఎవరిదీ..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? తదితర విషయాలు తెలియాల్సి ఉంది. కాగా.. పిఠాపురం నుంచి జనసేనాని పవన్ అసెంబ్లీ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రతి అంశం వార్తల్లో నిలుస్తోంది. ఏపీలో మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుంది. ఈ తరుణంలో చివరి రోజుల్లో పెద్ద ఎత్తున నగదు చేతులు మారతాయని ఎన్నికల సంఘం నిఘా పెంచింది

Tags

Next Story