Amaravati: జగన్ సర్కార్‌కు ట్విస్ట్ ఇచ్చిన అమరావతి రైతులు..

Amaravati: జగన్ సర్కార్‌కు ట్విస్ట్ ఇచ్చిన అమరావతి రైతులు..
Amaravati: అమరావతి ప్రాంత రైతులు జగన్ సర్కార్‌కు ట్విస్ట్ ఇచ్చారు.

Amaravati: అమరావతి ప్రాంత రైతులు జగన్ సర్కార్‌కు ట్విస్ట్ ఇచ్చారు. సీఆర్డీఏ, రేరాకు నోటీసులు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువులోగా ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనందుకు పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గజానికి 50, వాణిజ్య స్థలానికి 75 రుపాయల వంతున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీఆర్‌డీఏ తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణ దశలోనే ఉందని, సీఆర్డీఎ భూసమీకరణ ప్రాజెక్టును రియల్‌ ఎస్టేట్‌ చట్టం కింద రిజిస్టర్‌ చేయాలని నోటీసుల్లో రేరాను కోరారు.

అమరావతిలో సకాలంలో అంతర్జాతీయ రాజధానిని నిర్మించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, భూములిచ్చిన రైతులను మోసం చేసినందున CRDAకు పెనాల్టీ విధించాలని రెరాకు రైతులు ఫిర్యాదు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్యాకేజీ విధానంలో తమకు కల్పించిన ప్లాట్లలో మూడేళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని సీఆర్డీఏ చెప్పిందన్నారు. మూడేళ్లు దాటినా ఎలాంటి మౌలిక సదుపాయాలూ కల్పించలేదని.. ఏ పనులు చేపట్టలేదని తెలిపారు. సీఆర్డీఏ చర్యల వల్ల తాము ఉపాధి కోల్పోయామన్నారు.

ఇటీవల మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై తీర్పు వెలువరించిన హైకోర్టు.. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించింది. 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని, మూడు నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం తీర్పుఇచ్చింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును అనుసరిస్తూ రైతులు ఇలా లీగల్ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story