AP : టీడీపీలో చేరిన వైసీపీ కేడర్

AP : టీడీపీలో చేరిన వైసీపీ కేడర్

టీడీపీ సీనియర్‌ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో వైసీపీ కేడర్‌ టీడీపీలో చేరారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం నూజెళ్లకు చెందిన 50 మంది వైసీపీ మహిళా కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వెనిగండ్ల రాము. టీడీపీకి కొండంత అండ మహిళామణులేనని, వైసీపీ పాలనతో విరక్తి చెందిన మహిళలు, యువత.. స్వచ్ఛందంగా టీడీపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. చంద్రబాబు వస్తేనే తమకు భవిష్యత్తు అని.. ప్రజలు భావిస్తున్నారన్న ఆయన.. చంద్రబాబును సీఎం చేయడమే టీడీపీ కార్యకర్తల ఏకైక లక్ష్యమన్నారు. గుడివాడలో టీడీపీ ప్రభంజనం ఏంటో చూపిస్తారని.. జాబు కావాలంటే బాబు రావాలన్న మంత్రాన్ని యువత జపిస్తున్నారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story