CBN: బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు పెడితే తాను బెల్ట్ తీస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాము తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. వైసీసీ హయాంలో కల్తీ లిక్కర్ విక్రయించి ప్రజల జేబులు గుళ్ల చేశారని విమర్శించారు. దందాలు చేస్తే నాయకులైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వితంతు రుద్రమ్మ ఇంటికెళ్లి పింఛను అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యమ్మకు దివ్యాంగ పింఛను రూ.15 వేలను సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు. ఆంజనేయస్వామి గుడిలో పూజలు నిర్వహించారు. మహిళలు, స్కూలు పిల్లలతో సీఎం ముచ్చటించారు.
వైసీపీది విధ్వంస పాలన
రాష్ట్రంలో సంపద సృష్టించి.. పేదలకు పంచాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. అన్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో విధ్యంస పాలన జరిగిందని.. వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయన్నారు. అలాగే గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని గుర్తు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహించదని.. బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తామని.. మద్యం షాపుల విషయంలో నాయకులు, దందాలు చేసేవారు మధ్యలో దూరితే వదిలిపెట్టనని సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
దందాలు చేస్తే వదలను
45 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కూటమి పార్టీలను గెలిపించారన్నారు. పక్క రాష్ట్రాల్లో పింఛన్లు చాలా తక్కువగా ఇస్తున్నారన్నారు. కర్ణాటకలో కేవలం రూ.1200 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఎన్ని అప్పులు చేయాలో అన్నీ చేశారన్నారు. చివరకు తహసీల్దార్ ఆఫీసులు కూడా తాకట్టుపెట్టారన్నారు. గత ప్రభుత్వం నాసిరకం మద్యం దొరికేదని, ఇప్పుడు మంచి మద్యం దొరుకుతుందన్నారు. అయితే బెల్ట్ షాపులు పెడుతున్నారని ప్రచారం జరుగుతోందన్నారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం షాపుల విషయలో దందాలు చేస్తే వారిని వదలనంటూ హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com