AP Inter Results : ఇవాళ ఏపీ ఇంటర్‌ ఫలితాలు

AP Inter Results : ఇవాళ  ఏపీ ఇంటర్‌ ఫలితాలు

ఏపీ ఇంటర్‌ ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్‌ బోర్డు ప్రకటించనుంది. శుక్రవారం తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి ఫస్టియర్‌కు 5,17,617, సెకండ్ ఇయర్‌కు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

పరీక్షా ఫలితాలను పొందాలనుకునే విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా అధికారిక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను విడుదల చేస్తారా.. లేక గ్రేడ్ ల వారిగా ఫలితాలను విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

అలాగే పరీక్షా ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తోంది విద్యాశాఖ. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story