AP Municipal Elections: బేతంచర్లలో ఆర్థిక మంత్రికి ఎదురుదెబ్బ.. సొంత వార్డులో పరాజయం..
AP Municipal Elections: కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. బుగ్గన నివాసం ఉంటున్న వార్డులో టీడీపీ విజయం సాధించింది. 15వ వార్డులో 88 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి గెలుపొందారు. బేతంచర్లలో మొత్తం 6 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. అనేక వార్డుల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది.
బేతంచర్లలో ఓడినా సరే.. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించామన్న ఆనందంలో ఉన్నారు స్థానిక టీడీపీ నేతలు. ఇక బేతంచర్లలో మొత్తం 20 వార్డుల్లో ఆరు చోట్ల టీడీపీ గెలిచింది.. మిగిలిన వారు కూడా స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమిపాలయ్యారు.. అయితే, చివరి వరకు అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి ముచ్చెమటలు పట్టించారు.
మొత్తంగా బేతంచర్లలో 11వేలా 69 ఓట్లు పోలైతే.. టీడీపీకి 9వేలా 538 ఓట్లు వచ్చాయి.. అంటే కేవలం 1500 ఓట్ల తేడాతోనే బేతంచర్లలో వైసీపీ బయటపడినట్లు స్పష్టంగా కనబడుతోంది. బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింది. మంత్రి బుగ్గన సొంత కోటకు బీటలు వారాయి. దీంతో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com