వైసీపీ ఎంపీలను గొర్రెలతో పోల్చిన అచ్చెన్నాయుడు..!

X
By - TV5 Digital Team |23 March 2021 3:00 PM IST
వైసీపీ ఎంపీలను గొర్రెలతో పోల్చారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. 22 మంది వైసీపీ ఎంపీలు గొర్రెలంటూ కామెంట్స్ చేశారు.
వైసీపీ ఎంపీలను గొర్రెలతో పోల్చారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. 22 మంది వైసీపీ ఎంపీలు గొర్రెలంటూ కామెంట్స్ చేశారు. టీడీపీ ముగ్గురు ఎంపీలూ సింహాలని అన్నారు.. 22 మంది వైసీపీ ఎంపీలు ఏం సాధించారని అచ్చెన్నాయుడు నిలదీశారు. టీడీపీకి వున్న ముగ్గురు ఎంపీలతోపాటు తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే.. నలుగురూ రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తారని అన్నారు.. మంత్రులకు, ముఖ్యమంత్రికి డబ్బు మదం పట్టిందన్నారు.. అన్నీ డబ్బుతో, బెదిరింపుతో గెలవాలనుకుంటే సాధ్యం కాదన్నారు. స్థానిక ఫలితాలకు, తిరుపతి ఉప ఎన్నిక ఫలితానికి తేడా ఉంటుందన్నారు అచ్చెన్నాయుడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com