Big Alert : అలిపిరి అలర్ట్.. మెట్లదారిలో ఎలుగుబంటి

X
By - Manikanta |20 March 2024 4:30 PM IST
తిరుమల (Tirumala) వెళ్తున్న భక్తులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది టీటీడీ. క్రూర మృగాల సంచారంపై మరో భయంగొలిపే వార్త అలజడి రేపుతోంది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం వార్త తెలిసిన భక్తులు నడక మార్గంలో భయంతో అడుగులో అడుగు వేస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాల ద్వారా ఎలుగుబంటి తిరుగుతున్నట్లుగా గుర్తించారు.
టీటీడీ అలర్ట్ ఇవ్వడంతో పాటు.. భక్తుల రక్షల కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తిని పెంచింది. ఒంటరిగా మెట్ల దారిలో రావొద్దని, గ్రూపులుగా మాత్రమే రావాలంటూ టీటీడీ అధికారులు సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com