AP : ఏపీ ఎన్నికల ఇన్ఛార్జులను ప్రకటించిన బీజేపీ

X
By - Manikanta |21 March 2024 3:33 PM IST
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ, రాజస్థాన్, హరియాణాకు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి, కో-ఇన్ఛార్జీలను నియమించింది. ఏపీ ఎన్నికల ఇన్ఛార్జిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కో-ఇన్ఛార్జిగా యూపీ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ను నియమించింది. రాజస్థాన్కు వినయ్, విజయా, ప్రవేశ్ వర్మను, హరియాణాకు సతీశ్ పూనియా, సురేంద్ర సింహ్ నాగర్ను నియమించింది. కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని కమలం పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com