Road Accident : కంటైనర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం

లంకెలపాలెం జంక్షన్లో ఘటన పరవాడ (అనకాపల్లి)లంకెలపాలెం ప్రధాన జంక్షన్లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాజువాక నుంచి అనకాపల్లి వైపు వస్తున్న మార్కెట్ లారీ ఇక్కడ లంకెలపాలెం జంక్షన్కు చేరుకునేసరికి పరవాడ వైపు నుంచి వస్తున్న భారీ కంటైనర్ ఢీకొనడంతో అందులో ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను ఈ రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడకు అక్కడే మృతి చెందారు. ఫార్మా సిటీలో బి షిఫ్ట్ ముగించుకొని తిరిగి వస్తుండగా లంకెలపాలెం జంక్షన్కి వచ్చేసరికి ఈ ప్రమాదం జరిగింది. అందులో ఒకరు ఫార్మసిటి ఉద్యోగి కాగా మరో ముగ్గురు కారులో ఉన్న వారు మృతి చెందారు. వేరే కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఆగి ఉన్న మరో 8 ద్విచక్ర వాహనాల పై కన్ టైనర్ లారీ బోల్తా పడింది. చనిపోయిన వారిని అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. గాయపడిన వారిని గాజువాక ఆర్కే ఆసుపత్రికి తరలించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com