జగన్ ఢిల్లీ వెళ్లింది తన కేసుల మాఫీ కోసమా ? రాష్ట్ర ప్రయోజనాల కోసమా..? : చంద్రబాబు

జగన్ ఢిల్లీ వెళ్లింది తన కేసుల మాఫీ కోసమా ? రాష్ట్ర ప్రయోజనాల కోసమా..? : చంద్రబాబు

రాజమండ్రి పార్లమెంటు టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నేతలతో మాట్లాడుతూ.. జగన్ ఢిల్లీ పర్యటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. జగన్ ఢిల్లీ వెళ్లింది తన కేసుల మాఫీ కోసమా ? రాష్ట్ర ప్రయోజనాల కోసమా..? అని ప్రశ్నించారు. 10సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి జగన్ ఒరగబెట్టిందేమిటని చంద్రబాబు అన్నారు.

విశాఖ రైల్వే జోన్‌కు నిధులు, కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో కేంద్రాన్ని అడిగారా అంటూ బాబు ప్రశ్నించారు. విసిఐసి, బిసిఐసి ఏమయ్యాయో పట్టించుకున్నారా అని బాబు అన్నారు. పెట్రోలియం కాంప్లెక్స్ ఏమైందో ప్రశ్నించారా.. తొలి ఏడాది ఆర్థిక లోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు కేంద్రాన్ని అడిగారా చంద్రబాబు అన్నారు.

అప్పుడు మెడలు వంచుతానని చెప్పి, ఇప్పుడు సాష్టాంగ దండ ప్రమాణాలు ఏమిటని బాబు ఎద్దేవా చేశారు. వాక్సిన్ పంపిణీ వంకతో స్థానిక ఎన్నికల వాయిదాతో జగన్నాటకానికి తెరలేపారని బాబు విమర్శించారు. డిసెంబర్ 25నుంచి కోటిమందికి వ్యాక్సిన్ అంటూ దొంగట్వీట్లు పెడుతున్నారని బాబు అన్నారు. నిష్పాక్షికంగా స్థానిక ఎన్నికలు జరిగితే వైసీపిని ఓటమి భయం వెంటాడుతోందన్నారు. స్థానిక ఎన్నికలకు టిడిపి నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలని బాబు పిలుపునిచ్చారు. గతంలో వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు బాబు కోరారు.



Tags

Read MoreRead Less
Next Story