Chandrababu: ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలి- చంద్రబాబు
Chandrababu: జగన్ సర్కార్ పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ ఛార్జీలపై ఎమ్మెల్యేను నిలదీసిన సోదరి తెగువకు వందనం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వం చేస్తున్నమోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను మహిళలు నిలదీసే దాకా పరిస్థితి వచ్చిందన్నారు.
తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనంపై గళమెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ట్వీట్ చేశారు. జగన్ జేబు నుంచి ఇచ్చారా? అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత? తాము వాటితో బతుకుతున్నామా అంటూ ఆడబిడ్డ ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని చంద్రబాబు ప్రశ్నించారు.
పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీల పై ఎమ్మెల్యేలను సైతం రోడ్డున నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనం పై గళ మెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?(1/2) pic.twitter.com/GLACMD7yZv
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com