Chandrababu: అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తాం-చంద్రబాబు

X
By - Divya Reddy |28 May 2022 8:00 PM IST
Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఓ ఉన్మాది పాలన నడుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఓ ఉన్మాది పాలన నడుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తామని అన్నారు. అంచనాలకు మించి హాజరైన టీడీపీ శ్రేణులను ఉద్దేశించి రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు ప్రసంగించారు. బాదుడే బాదుడుతో రాష్ట్ర ప్రజల నడ్డి విరుస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ను త్వరగా ఇంటికి పంపాలనే ఉత్సాహంతో.. క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ అవినీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com