Chandrababu: జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉంది: చంద్రబాబు

Chandrababu: జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉంది: చంద్రబాబు
Chandrababu: జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలు రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. అమరావతిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు చంద్రబాబు. కరెంట్ ఛార్జీల మోత, పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో....ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. కరెంట్ ఎందుకు పోతోందో, బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఆదాయం కోసమే జగన్ ప్రజలపై భారం మోపుతన్నారని మండిపడ్డారు చంద్రబాబు.

అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్తజిల్లాలు ఏర్పాటు చేశారన్నారు చంద్రబాబు. జగన్‌కు ఓటేసి తప్పు చేశామనే భవన ఆయన సొంతవర్గంలోనూ ఉందన్నారు. అటు వైజాగ్‌లో ల్యాండ్ స్కామ్, దేవాలయాలపై దాడులను ఖండించారు చంద్రబాబు. విశాఖ మధురవాడలోని IT హిల్స్‌లో A2 విజయసాయిరెడ్డి 1550కోట్ల భూదందాకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ లిక్కర్ షాపుల నుంచే సెకండ్ క్వాలిటీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story