Chandrababu: టీడీపీ ప్రస్థానానికి 40 ఏళ్లు.. ప్రత్యేక లోగో ఆవిష్కరించిన చంద్రబాబు..

Chandrababu: టీడీపీ ప్రస్థానానికి 40 ఏళ్లు.. ప్రత్యేక లోగో ఆవిష్కరించిన చంద్రబాబు..
X
Chandrababu: జగన్ అసమర్థత వల్లే పోలవరం బలైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Chandrababu: జగన్ అసమర్థత వల్లే పోలవరం బలైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించామన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి పోలవరం నిర్మాణాన్ని కొనసాగించామని తెలిపారు. జగన్ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. డయాఫ్రం వాల్ ఎప్పుడు పూర్తవుతుంది.. నీళ్లెప్పుడిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

జంగారెడ్డిగూడెం మరణాలపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు చంద్రబాబు. కల్తీ మరణాలపై కనీసం స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్న ఆయన.. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. నీతిమాలిన చీకటి వ్యాపారం కోసం దుర్మార్గంగా ప్రవర్తించారని.. ఏపీలో ఉన్నవి కల్తీ బ్రాండ్లేనని చంద్రబాబు అన్నారు. అంతకుముందు 40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంపై చంద్రబాబు ప్రత్యేక లోగో ఆవిష్కరించారు. పార్టీ చేసిన కార్యక్రమాలు, పనులను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా వివిధ దేశాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలు చేయాలని సూచించారు చంద్రబాబు.

Tags

Next Story