Chandrababu: పొత్తులకు ఇంకా సమయం ఉంది- చంద్రబాబు

X
By - Divya Reddy |8 May 2022 8:20 PM IST
Chandrababu: వైసీపీ అరాచకాలు ఇంకెంతకాలం కొనసాగవన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
Chandrababu: వైసీపీ అరాచకాలు ఇంకెంతకాలం కొనసాగవన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వారి అరాచకాలకు ముగింపు పలికేందుకు సమయం దగ్గరపడిందని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ ఆగడాలపై అసలు వడ్డీతో సహా తీరుస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. టీడీపీ నాయకులపై జరుగుతున్నదాడులపై తీవ్రంగా మండిపడ్డారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో టీడీపీ నాయకులపై వైసీపీ దాడులు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయన్నారు. వైసీపీ వర్గాలపై ఇంతవరకు కేసునమోదు చేయకపోవడం దారుణమన్నారు. పొత్తులపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జగన్మోహన్ రెడ్డిపొత్తులపై తనొక్కడే మొగోడని వర్రవీగుతున్నాడు అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com