వరుస దుర్ఘటనలపై చంద్రబాబు వీడియో..

వరుస దుర్ఘటనలపై చంద్రబాబు వీడియో..
X
ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా..అంటూ జగన్ పాలనలో జరిగిన అనేక సంఘటనలను ఏపీ ప్రజల ముందుంచారు.

ఏపీలో వరుస దుర్ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో విడుదల చేశారు. నాలుగేళ్ల నరకం అంటూ వివిధ ఉదహరణలు వీడియోలు చూపారు. ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా.. అంటూ జగన్ పాలనలో జరిగిన అనేక సంఘటనలను ఏపీ ప్రజల ముందుంచారు. టెన్త్ కుర్రాడిని వైసీపీ నేతలు సజీవ దహనం చేసినా.. ఏలూరులో యాసిడ్ దాడి జరిగినా.. ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడలేదని చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు, మచిలీపట్నంలో అత్యాచార ఘటనలపైనా జగన్ స్పందించలేదని ఫైర్ అయ్యారు. రాజకీయ కక్షతో మహిళను ట్రాక్టర్‌తో గుద్దించి చంపినా.. ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వరుస సంఘటనలు జరిగితే ఈ బిడ్డ శాంతిభద్రతలపై కనీస సమీక్ష చేయలేదని ఆరోపించారు. ఏదైనా దుర్ఘటన జరిగితే జగన్‌కు తెలిసిందల్లా చిక్కటి చిరునవ్వుతో.. మృతుల కుటుంబాలకు డబ్బులు అందించడం మాత్రమేనని విమర్శించారు. నిజంగా ప్రజల బిడ్డ అయితే దాడులు చేసిన సొంత పార్టీ నేతలను కాపాడుకుంటాడా అని నిలదీశారు. మీ బిడ్డే అయితే నష్ట పరిహారాన్ని నవ్వుతూ ఇప్పిస్తాడా ప్రజల బిడ్డే అయితే.. పేదల ప్రాణాలు వెలకట్టే పెత్తందారు అయ్యేవాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన నాలుగేళ్ల నరకం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Tags

Next Story