MLC Ashok Babu: సీఐడీ ఆఫీసులో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు విచారణ..

MLC Ashok Babu (tv5news.in)
MLC Ashok Babu: గుంటూరు సీఐడీ ఆఫీసులో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు విచారణ కొనసాగుతోంది. అటు అశోక్బాబు అరెస్ట్ను నిరసిస్తూ టీడీపీ నేతలు సీఐడీ కార్యాలయానికి భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. దీంతో దేవినేని ఉమాతో పాటు టీడీపీ నేతలు కోవెలమూడి, బుచ్చిరాం, పిల్లి మాణిక్యా రావులను పోలీసులు అరెస్టు చేశారు.
అశోక్ బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే అశోక్ బాబును చూపించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అశోక్ బాబు తరపు న్యాయవాదులు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు.ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు ప్రమోషన్ కోసం ఎడ్యూకేషన్ క్వాలిఫికేషన్ తప్పుగా చూపారన్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్ధరాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా.. చదివినట్లు తప్పుడు సర్టిఫికెట్ సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తాకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్తా.. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఇటీవల అశోక్ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా..గత నెల అశోక్బాబుపై 477-A, 466, 467, 468, 471, 465, 420, ఆర్డబ్ల్యూ-34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నోటీసులో వెల్లడించారు.
తన పదోన్నతిపై వివాదం గతంలోనే ముగిసిపోయిందని కేసు నమోదైన టైంలోనే అశోక్ బాబు వివరణ ఇచ్చారు. చిన్న టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల జరిగిన దాన్ని నేరంగా పరిగణించకూడదు అంటూ విచారణ కమిటీ చెప్పిందని తెలిపారు. తన విద్యార్హత D-కామ్ అయితే B-కామ్ అని తప్పుగా టైప్ చేయడం వల్లే వివాదం తలెత్తిందన్నారు. దానివల్ల తాను ఎలాంటి అదనపు బెనిఫిట్స్ పొందలేదనే విషయాన్ని కూడా విచారణాధికారి తేల్చారని, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా ముగిసిందని వివరణ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు కావాలనే ఫిర్యాదు చేసి తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com