CBN: అంతా జగన్నాటకమే

వైసీపీ నేతలు పులివెందుల తరహా రాజకీయాలు చేస్తే.. తోక కట్ చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విశాఖలో వైసీపీ నేతలు భూములు కొట్టేశారని ఆరోపించారు. ఎవరైనా భూముల జోలికి వస్తే...వెన్నులో భయం వచ్చేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని గుర్తుచేశారు. వైసీపీ నేతల మాటలను విశాఖ వాసులు నమ్మలేదని.. మొన్నటి ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఘోరంగా ఓడించారని చెప్పారు. విశాఖకు కూటమి ప్రభుత్వం రుణపడి ఉందని...ఎంత చేసిన తక్కువే అనిపిస్తోందని అన్నారు. అంతా జగన్నాటకమే అంటూ వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నన్నే జగన్ మోసం చేశాడు. బాబాయ్ మృతి ముందు గుండెపోటు అన్నాడు. తర్వాత హత్య అని, ఆ నింద నాపై వేసే ప్రయత్నం చేశాడు. నిజానికి బాబాయ్ గుండెపోటు, గులకరాయి దాడి, కోడి కత్తి అన్నీ నాటకం.. జగన్నాటకం’ అని చంద్రబాబు మండిపడ్డారు.
అంతా జగన్నాటకమే: చంద్రబాబు
అంతా జగన్నాటకమే అంటూ వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నన్నే జగన్ మోసం చేశాడు. బాబాయ్ మృతి ముందు గుండెపోటు అన్నాడు. తర్వాత హత్య అని, ఆ నింద నాపై వేసే ప్రయత్నం చేశాడు. నిజానికి బాబాయ్ గుండెపోటు, గులకరాయి దాడి, కోడి కత్తి అన్నీ నాటకం.. జగన్నాటకం’ అని చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీలో ఒక భూతం ఉంది: చంద్రబాబు
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఒక భూతం ఉందని, అది మళ్లీ లేస్తే ఎలా అని ప్రజలు భపడుడతున్నారంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ భూతానికి భయపడాల్సిన పనిలేదు. ఇక్కడ ఉంది చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉండి పులివెందుల మార్క్ రౌడీరాజకీయం చేస్తామంటే ఊరుకోం. తోక కట్ చేస్తాం’ అని వైసీపీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు.
కొత్త రికార్డు సృష్టించబోతున్నాం: చంద్రబాబు
యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించబోతున్న యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ‘పదేళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నాం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేలా ఏర్పాట్లు పర్యవేక్షించాలి. దాదాపు 3.4 లక్షల మందికి ఒకే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com