AP : జగన్ ధీమా ఈ పది పాయింట్ల పైనే!

వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో మరోసారి సీఎం అవ్వాలన్న ఉత్సాహంతో ఉన్నారు. సర్వేలు, లెక్కలపై ఆయన ధీమాగా ఉన్నారు. జూన్ 4నాడు అసలు రిజల్ట్ రాబోతోంది. జగన్ కూడా 151 కి పైగా అసెంబ్లీ సీట్లు సాధిస్తామని 22 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తామని బాహాటంగానే చెప్పేశారు. జగన్ కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం ఆయన తప్పక విజయం సాధించే అంశాలు కనిపిస్తున్నాయి.
తనకు కలిసి వచ్చే అంశాలు, ప్రభుత్వ వ్యతిరేఖాంశాలు, ఎమ్మెల్యేల విషయంలో మార్పులు చేర్పులు అన్నీ ముందుగానే తెలుసుకున్నారు. దీనిపై సర్వే చేయించి ఓ పది పాయింట్లు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇవే తనను గెలిపిస్తాయన్న అంచనాతో ఉన్నారు జగన్.
ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ రెడ్డి ఓట్లు
కూటమిలో కుమ్ములాటలు
కాపు ఓట్లు
షర్మిల రాకతో ప్రతిపక్ష ఓటు చీలిక
సంక్షేమ పథకాలు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
వాలంటీర్లు
పెరిగిన మహిళల ఓట్లు
గ్రామీణ ఓట్లు
పెరిగిన యువ ఓటర్లు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com