Counting Day : కౌంటింగ్ రోజు డ్రై డే: సీఈవో ముకేశ్

Counting Day : కౌంటింగ్ రోజు డ్రై డే: సీఈవో ముకేశ్

కౌంటింగ్ కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్లు చెప్పారు. జూన్ 4న డ్రై డే(మద్యం దుకాణాల మూసివేత)గా ప్రకటిస్తున్నామన్నారు. అవసరమైన చోట 144 సెక్షన్ విధిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్‌లను అభ్యర్థులు/ వారి ప్రతినిధులు రోజుకు 2 సార్లు ఫిజికల్‌గా పరిశీలించుకోవచ్చని తెలిపారు.

ఇప్పటికే పోలింగ్ తర్వాత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో దృష్ట్యా కౌంటింగ్‌కు గట్టి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే కేంద్ర బలగాలతో భద్రత చర్యలు చేపట్టారు.

ముఖ్యముగా అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు జిల్లా మాచర్ల, తిరుపతి జిల్లా చంద్రగిరిపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్తత వాతావరణమే కొనసాగుతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, ఆ రోజు కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన ఎన్నికల పోలింగ్ ఫలితాలను జూన్ 04 ప్రకటించడంతో ఆ రోజు కోసం దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు

Tags

Next Story