AP : సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు

AP : సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు
X

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మరింత ముదిరింది. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడటంతో లీడర్ల కామెంట్స్, వారిపై పోలీసుల యాక్షన్ ఉత్కంఠను పెంచుతోంది.

వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు నమోదైంది. సజ్జల కామెంట్స్ ఈసీ, పోలీసులను కించపరిచేలా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story