TTD : టీటీడీ వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!

TTD : టీటీడీ  వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!

గత ఏడాది అక్టోబర్ 7 నుంచి రూ.2వేల నోట్ల మార్పిడిని ఆర్బీఐ నిలిపివేయగా, ఆ తర్వాత కూడా కొందరు భక్తులు ఆ నోట్లను శ్రీవారి హుండీలో సమర్పించారు. ఆ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులు కోరగా, ఆర్బీఐ సానుకూలంగా స్పందించింది. ఈ ఏడాది మార్చి 22 వరకు ఐదు విడతల్లో రూ.3.20 కోట్లను మార్చినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

గతేడాది అక్టోబరు 8 నుంచి ఈ ఏడాది మార్చి 22 వరకూ అయిదు విడతల్లో రూ.3.20 కోట్ల విలువైన నోట్లు మార్చినట్లు సమాచారం. 2016లో జరిగిన నోట్ల రద్దు సమయంలో తితిదే వద్ద పోగైన సుమారు రూ.50 కోట్లను రిజర్వు బ్యాంకు తీసుకోలేదు. దీనిపై అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

గతేడాది అక్టోబరు 7వ తేదీ నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. పలు దఫాలు గడువు పొడిగిస్తూ ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లు మార్పిడి చేసుకునే అవకాశం కల్పించింది. అయితే రెండు వేల నోట్ల రూపాయలు బ్యాన్ చేసినా తర్వాత కూడా.. కొందరు భక్తులు స్వామి వారి హుండీలో వాటిని సమర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story