AP : జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా

X
By - Manikanta |19 Jun 2024 2:33 PM IST
హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ ( YS Jagan ) ఆస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. గతంలో సీఎంగా ఉండటంతో విచారణలో వాయిదాలు కోరుతూ వచ్చిన జగన్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
అటు ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పగించాలని జగన్కు సాధారణ పరిపాలన శాఖ(GAD) లేఖ రాసింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ నిధులతో ఫర్నీచర్ సహా పలు వస్తువులను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం కోసం కొనుగోలు చేయించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఇంకా సరెండర్ చేయకపోవడంతో GAD రంగంలోకి దిగి అప్పగించాలని కోరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com