AP : మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన
By - Manikanta |11 March 2024 7:41 AM GMT
నిడదవోలు (Nidadhavole) అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కందుల దుర్గేశ్ ఇక్కడి నుంచి కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. దుర్గేశ్ రాజమండ్రి రూరల్ కోసం పట్టుబట్టారు. అక్కడ టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఉండటంతో కందుల దుర్గేష్ను నిడదవోలుకు మార్చారు. కాగా టీడీపీ, జనసేన కూటమి ఇప్పటికే 99 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కందుల దుర్గేష్ కాంగ్రెస్ , వైసీపీలలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com