YCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ కార్యకర్తలు..
YCP: తాజాగా మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల లోగుట్టు ఏంటో అర్థంకాక వైసీపీ కార్యకర్తలు సతమతమవుతున్నారు.

YCP: వైసీపీ నేతల స్వరం మారుతోంది. పొరపాటున మాట్లాడుతున్నారో.. లేక ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత కారణంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారో కానీ... వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్ల వెనుక మర్మమేంటో అర్థంకాక పార్టీ క్యాడర్ జుట్టు పీక్కుంటోంది. తాజాగా మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల లోగుట్టు ఏంటో అర్థంకాక వైసీపీ కార్యకర్తలు సతమతమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో జరిగిన వైసీపీ ప్లీనరీలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఉండగానే హాట్ కామెంట్స్ చేశారు మంత్రి జోగి రమేష్.
వేదికపై ఉన్న నాయకులు ఈ రోజు వైసీపీలో ఉండొచ్చు .. రేపు మరోపార్టీలో ఉండొచ్చంటూ బాంబు పేల్చారు. వెల్లంపల్లి ఈరోజు వైసీపీలో ఉన్నా.. రేపు మరో పార్టీలో చేరవచ్చన్నారు. కానీ జగన్ మాత్రం ఉంటారని.. ఆయన వెంట కార్యకర్తలు ఉంటారని అన్నారు. కార్యకర్తలను పొగిడితే చప్పట్ల వర్షం కురుస్తుందనున్నారో.. లేక రేపు జరగబోయే పరిణామాలు ముందుగా చెప్పారో ఏమో కానీ.. మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలతో వేదికపై ఉన్నవారితో పాటు కార్యకర్తలు ఖంగుతిన్నారు. ఆయన మాటల్లో మర్మమేమిటో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు.
RELATED STORIES
Nupur Sharma : నుపుర్ శర్మను చంపాలనుకున్న ఉగ్రవాది అరెస్ట్..
13 Aug 2022 1:45 AM GMTTS High Court : తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు
12 Aug 2022 5:13 PM GMTBobby Kataria : విమానంలో సిగరెట్ తాగిన బాబీ కటారియా.. ఎలా కవరింగ్...
12 Aug 2022 3:29 PM GMTAamir Khan : అమీర్ ఖాన్ అస్సాం టూర్ను క్యాన్సల్ చేసుకోమన్న అస్సాం...
12 Aug 2022 3:06 PM GMTUP Constables : రోడ్డెక్కిన యూపీ కానిస్టేబుల్.. ఎందుకంటే..?
12 Aug 2022 1:10 PM GMTBihar Politics : దాని వల్ల శాంతి వస్తుందంటే ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు...
12 Aug 2022 9:01 AM GMT