AP : పవన్ కోసం హైపర్ ఆది నెలరోజుల ప్లాన్.. నెట్టింట వీరాభిమానం వైరల్

AP : పవన్ కోసం హైపర్ ఆది నెలరోజుల ప్లాన్.. నెట్టింట వీరాభిమానం వైరల్

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున జబర్దస్త్ టీం రంగంలోకి దిగింది. పవన్ వీరాభిమాని హైపర్ ఆది ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గురించి పలు సందర్భాలలో ఆయన ఇచ్చిన స్పీచ్ లు వైరల్ అవుతుంటాయి. హైపర్ ఆది తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీ అయ్యారు. మిగిలిన జనసేన అన్ని నియోజక వర్గాలలో పర్యటించి పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ఆది తెలిపారు. నెల రోజుల పాటు ఎలాంటి షూటింగ్స్ కి వెళ్ళమని, ఎన్నికల తరువాతనే షూటింగ్స్ జరుగుతాయని హైపర్ ఆది చెప్పడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా హైపర్ ఆది పిఠాపురంలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పిఠాపురంలో పర్యటించిన ఆది అధికార పార్టీ పై విమర్శలు చేశారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా తాము పిఠాపురం వచ్చానని అయితే ఇక్కడ ఎవరిని అడిగిన మా ఓటు పవన్ కళ్యాణ్ గారికే అంటూ చెబుతున్నారు. ఇక ఎన్నికలు జరగకుండానే పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత పిఠాపురం రూపు రేఖలు మారిపోతాయని తెలిపారు.

ఇప్పుడు మనం హైదరాబాద్ చూడటానికి ఎలా వెళ్తున్నామో రేపు పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత కూడా ఇక్కడ అభివృద్ధి చూసి పిఠాపురం చూడటానికి వస్తారని ఆది తెలిపారు. జనసేన మొదటి విజయం పిఠాపురం నుంచి మొదలవుతుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story