AP : పవన్ ప్రచారంలో జబర్దస్త్ కమెడియన్స్.. గెటప్ శీను హాట్ కామెంట్స్

AP : పవన్ ప్రచారంలో జబర్దస్త్ కమెడియన్స్.. గెటప్ శీను హాట్ కామెంట్స్

పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు జబర్దస్త్ కమెడియన్స్ కోట్లలో డీల్ మాట్లాడుకున్నారా.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వాడవాడలా తిరుగుతూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా గెలిపించాలని ఉద్దేశంతో జబర్దస్త్ టీం మొత్తం దిగిపోయారు. హైపర్ ఆది ఎప్పటినుంచో షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చి.. ఒక నెలపాటు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారానికి సిద్ధమయ్యాడు.

పిఠాపురంలో హైపర్ ఆది మకాం వేసి జనసేనకి గ్రేట్ సపోర్ట్ ఇచ్చాడు. అలాగే గెటప్ శీను, సుడిగాలి సుదీర్, రాంప్రసాద్, రాకెట్ రాఘవ లాంటి జబర్దస్త్ కమెడియన్స్ అంతా ప్రస్తుతం పిఠాపురంలో భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. పవన్ పేరు చెప్పుకుని వీళ్లు ఎన్నో స్కిట్స్ చేసి హిట్లు కొట్టి పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు దానికి రుణం చెల్లించుకుంటున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఐతే.. జబర్దస్త్ కమెడియన్స్ పిఠాపురంలో ప్రచారం చేసేందుకు డబ్బులు తీసుకున్నారని ఈవెంట్‌కి పేమెంట్ తీసుకున్నట్లు ఎన్నికల ప్రచారానికి దాదాపు మనిషికి రెండు కోట్ల వరకు డబ్బులు తీసుకుంటున్నారు అంటూ జనసేన పార్టీ ప్రత్యర్ధుల నుంచి ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ ఆరోపణలపై తాజాగా గెటప్ శీను స్పందించాడు. ' రాజా యాదవ్ ' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న గెటప్ శీను జనసేన ప్రచారం కోసం డబ్బులు తీసుకుంటున్నారు అంటూ వస్తున్న ప్రచారాల్లో నిజం లేదని.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయన మంచి నాయకుడిగా ఉంటారని నమ్మకంతో ఆయనకు ప్రచారం చేస్తున్నామని.. మీకు సందేహం ఏదైనా ఉంటే మా బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ ఇస్తాము.. చెక్ చేసుకోమంటూ చెప్పుకొచ్చాడు.

Tags

Next Story