AP : వేలానికి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఆస్తులు

AP : వేలానికి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఆస్తులు

ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక (Butta Renuka) ఆస్తుల వేలానికి LIC హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆమె భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మరికొన్ని సంస్థల ఆస్తులను మే 6న వేలం వేయనుంది. కొన్నేళ్ల క్రితం LIC హౌసింగ్ నుంచి వ్యాపార అవసరాల కోసం రూ.340 కోట్ల రుణం తీసుకోగా.. నష్టాలు రావడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో LIC వేలం ప్రకటన ఇవ్వగా, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు.

బుట్టా రేణుక కుటుంబ సభ్యులకు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులతో పోల్చితే ఈ అప్పు ఓ లెక్కలోకి కూడా రాదు. రెండుమూడు ఆస్తులు విక్రయించినా... మొత్తం అప్పు తీరిపోతుంది. బుట్టా దంపతులు దాదాపు రూ.360 కోట్లను రెండు రుణ ఖాతాల ద్వారా తీసుకున్నారు.

ఈ రుణానికి 2019 నవంబరు 18న బుట్టా రేణుక, బీఎస్‌ నీలకంఠకు డిమాండ్‌ నోటీసు పంపింది. ఈ ఆస్తుల రిజర్వు ధరను రూ.360 కోట్లుగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ పేర్కొంది. ఈ ఆస్తులన్నింటినీ ఏకమొత్తంలో ఈ-వేలం ద్వారా విక్రయిస్తామని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story