AP : పల్నాడు ఘటనలపై ఎస్పీ బిందు మాధవ్ సీరియస్

AP : పల్నాడు ఘటనలపై ఎస్పీ బిందు మాధవ్ సీరియస్

పల్నాడు జిల్లాలో ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్. గురజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హింస చలరేగడంతో.. రెండు రోజులుగా గ్రామాల్లో కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉదయం పిన్నెల్లి గ్రామంలో 50 పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు, వేట కొడవళ్ళు గొడ్డళ్లు లాంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఘనటలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

పెట్రోల్ బాంబులు తయారు చేసే ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నామని చెప్పారు. విచారణ తర్వాత నిందితులను కోర్టులో హాజరు పరిచి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు ఎస్పీ బిందు మాధవ్.

Tags

Next Story