Nara Bhuvaneswari: ‘కలలకు రెక్కలు’.. పథకాన్ని ప్రకటించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari: ‘కలలకు రెక్కలు’.. పథకాన్ని ప్రకటించిన నారా భువనేశ్వరి
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడపిల్లల కోసం చంద్రన్న కానుక..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం అని పేర్కొన్నారు. అందుకే మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం పని చేసింది తెలుగుదేశం అని వివరించారు. విద్య, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపింది తెలుగుదేశం అని పేర్కొన్నారు.మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశమనీ.. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు నిరంతరం పని చేసింది తామేనని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇంటర్ పూర్తైన విద్యార్థినులు దేశంలో ఎక్కడైనా చదువునే విధంగా ఉన్నత చదువుల కోసం కలలకు రెక్కలు పథకాన్ని తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ పథకం కింద విద్యార్థినులు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుందనీ.. కోర్సు కాలానికి ఋణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. కలలకు రెక్కలు పథకంలో మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకోండి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు నిజం గెలవాలి యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి ఈ పథకాన్ని తొలుత ప్రకటించారు. పథకంలో భాగంగా ప్రొఫెషనల్‌ కోర్సులు నేర్చుకునే వారికి ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్లు భువనేశ్వరి చెప్పారు. వీటికి వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని భువనేశ్వరి తెలిపారు.

"ఇంటర్ పూర్తయిన విద్యార్థులు పైచదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. kalalakurekkalu.com వెబ్ సైట్ ద్వారా అర్హులైన విద్యార్థులు నమోదు చేసుకోవాలి. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం. మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ టీడీపీ. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు తెలుగు దేశం నిరంతరం పని చేస్తోంది. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకే మహాశక్తి పథకాన్ని ప్రకటించాం. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం" అని చంద్రబాబు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story