Chandrababu : జగన్ పాలనతో వైసీపీ పని అయిపోయింది : చంద్రబాబు
Chandrababu : జగన్ పాలనతో వైసీపీ పని అయిపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు.... జరగబోయేది వన్ సైడ్ ఎలక్షన్ అన్నారు. ఇంతటి ప్రజావ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు. కార్యకర్తల్లో కసి, పాలనపై ప్రజల అసంతృప్తి... మహానాడు గ్రాండ్ సక్సెస్కు కారణమన్న చంద్రబాబు.. ఒంగోలు నేతలు సమిష్టి కృషితో... మహానాడును సక్సెస్ చేశారని అభినందించారు.
ఈ నమునాను అన్ని జిల్లాలు పాటించాలన్నారు. పార్టీలో గ్రూపులకు చెక్ పడాల్సిందేనని ఎవరికీ మినాయింపులు లేవన్నారు. ఏ స్థాయిలోనూ గ్రూపులను సహించేది లేదని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక ఓట్ల తొలగింపు విషయంలో గ్రామస్థాయిలో... నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తెచ్చిన.. న్యూట్రిపుల్ యాప్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com