సీఐడీ నోటీసులపై కోర్టుకెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు

X
By - Nagesh Swarna |18 March 2021 1:08 PM IST
వారి సూచనల ప్రకారమే నోటీసులపై విచారణకు వెళ్లకూడదని భావించిన చంద్రబాబు.. కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
సీఐడీ ఇచ్చిన నోటీసులపై కోర్టుకెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఐడీ పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ భూముల బదలాయింపులపై ఈనెల 23న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చింది సీఐడీ. కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసులు కాబట్టి.. కోర్టులోనే తేల్చుకోవాలనుకుంది టీడీపీ. ఇదే విషయంపై న్యాయనిపుణులతో పాటు టీడీపీ లీగల్ సెల్తోనూ చర్చించారు చంద్రబాబు. వారి సూచనల ప్రకారమే నోటీసులపై విచారణకు వెళ్లకూడదని భావించిన చంద్రబాబు.. కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com