టీడీపీ నేత, ఎన్నారై మన్నం వెంకటరమణ కన్నుమూత

టీడీపీ నేత, ఎన్నారై మన్నం వెంకటరమణ కన్నుమూత

టీడీపీ (TDP) నేత, ఎన్నారై మన్నం వెంకటరమణ (Mannam Venkataramana) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్‌కు వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. వెంకటరమణ మరణంపై టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

వెంకటరమణది ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెం. ఆయన కష్టపడి అమెరికాకు వెళ్లారు.. గీతను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మన్నం వెంకటరమణ 2009లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story