టీడీపీ మినీ మేనిఫెస్టో..బస్సులు ద్వారా ప్రచారం..

టీడీపీ మినీ మేనిఫెస్టో..బస్సులు ద్వారా ప్రచారం..
ఐదు బస్సులపై చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో పథకాలను స్టిక్కర్ల రూపంలో బస్సులకు అంటించారు.

రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ సమాయత్తం అయింది. రేపట్నుంచి ఏపీ అంతటా ఐదు బస్సులను తిప్పనుంది. ఈ ఐదు బస్సులపై చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో పథకాలను స్టిక్కర్ల రూపంలో బస్సులకు అంటించారు. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సులు తిరగనున్నాయి. టీడీపీ నేతలు ప్రజలకు కరపత్రాలను పంచనున్నారు. ఇంటింటికి వెళ్లి మినీ మేనిఫెస్టోను ప్రజలకు అందజేయనున్నారు. నియోజకవర్గాల్లో ఉండే ఇంఛార్జ్‌లు సీనియర్‌ నేతలు అంతా ఈ బస్సుల్లో వెళ్లి రేపట్నుంచి ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story