Tirumala Boy Abduction : తిరుమల బాలుడి కిడ్నాప్.. ఎలా సేఫ్ అయ్యాడంటే..!

Tirumala Boy Abduction : తిరుమల బాలుడి కిడ్నాప్.. ఎలా సేఫ్ అయ్యాడంటే..!

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగిన 24 గంటల్లోనే మహిళను అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ చేసిన మహిళ బాలుడి కిడ్నాప్ గురించి చెప్పిన విషయాలు విన్న పోలీసులు సైతం షాకయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజకు చెందిన నగేష్, పరిమళ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆదివారం దర్శనానికి ముందు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల పిఏసీ 2లో వారు సేద తీరారు.

తూర్పుగోదావరి జిల్లా రాజా నగరానికి చెందిన ఇజ్జాడ దేవి అనే మహిళ మొబైల్ ఫోన్తో అభినయ్ ను ఆడిస్తూ, తల్లిదండ్రుల కళ్ళు కప్పి అక్కడ నుంచి బాలుడిని కిడ్నాప్ చేసింది. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో బిడ్డ కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కిడ్నాప్ చేసిన బాలుడిని ఒక జీపులో తిరుపతికి తీసుకువచ్చిన దేవి అక్కడినుంచి సంధ్య థియేటర్ రోడ్ లోకి వెళ్లి అక్కడున్న ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఆవుల ప్రభాకర్ యాదవ్ ను అద్దె గది కావాలని అడిగింది. ప్రభాకర్ యాదవ్ అద్దె గదులు పెద్దకాపు లే అవుట్ లో ఉంటాయని ఆ మహిళకు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మహిళ వెళ్లిన కొద్దిసేపటికే ఆర్టీసీ డిపో మేనేజర్ ద్వారా వాట్సాప్ లో కిడ్నాప్ వివరాలు చూసిన ప్రభాకర్ బాలుడికి గుర్తుపట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పెద్దకాపు లేఔట్ లోని లాడ్జి లలో ఉన్నట్టు అనుమానించిన పోలీసులు, అక్కడ గాలించి.. నిందితురాలిని, బాలుడిని పట్టుకున్నారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

తనకు మగపిల్లాడు లేడని.. పెంచుకునేందుకు కిడ్నాప్ చేశానని కిడ్నాప్ చేసిన మహిళ పోలీసులకు చెప్పింది. ఐతే.. ఆ బాలుడిని అమ్మేందుకు మహిళ ప్రయత్నించిందని పోలీసులు సమాచారం సేకరించారు. పోలీసులు డీటెయిల్డ్ గా దర్యాప్తుచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story