AP : విశాఖలో విషాదం.. గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

X
By - Manikanta |11 April 2024 10:49 AM IST
విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక ఓ బ్యాంకులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆయన ఉదయం.5 గంటలకు డ్యూటీకి హాజరై ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శంకర్రావు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కుటుంబ సమస్యలా? లేదా విధుల్లో ఒత్తిడి ఏమైనా ఉందా? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com